Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 247 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. గురువారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.47 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో బుధవారంసాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 51,521 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 45,608 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,913 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,355 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,877 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 315 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 71 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా జోగులాంబ గద్వాల, ములుగు, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
15 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రంలో బుధవారంతో పోలిస్తే గురువారం జీహెచ్ఎంసీతో సహా 15 జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
12 జిల్లాల్లో తగ్గిన కరోనా
జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో కేసులు తగ్గాయి.
వారం రోజులుగా నారాయణపేటలో కేసులు నో.....
నారాయణపేట జిల్లాలో వారం రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఆరు రోజులుగా జీరో కేసులు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మూడు రోజులుగా, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో రెండు రోజులుగా కేసులు పెరుగుదల గానీ, తగ్గుదల గాని లేదు.