Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొద్ది రోజుల క్రితమే దేశ రాజధానికి వెళ్లొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ఢిల్లీ విమానమెక్కనున్నారు. శుక్రవారం ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ, సమావేశాల ప్రారంభం రోజునే సీఎం ఢిల్లీకి పోవటం చర్చనీయాంశమవుతున్నది. ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే శాసన సభా సమావేశాలకు హాజరవుతారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీకి పయనమవుతారు. శనివారం కేంద్రమంత్రి గజేం ద్రసింగ్ షెకావత్తో భేటీ కానున్న కేసీఆర్, 26న కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వ హించే సమావేశానికి హాజరవు తారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయెల్తో చర్చి స్తారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్కు బయల్దేరతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.