Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల భద్రతపై ప్రత్యేక కార్యక్రమం
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
మహిళలకు భద్రతపై అవగాహన కల్పించడానికి ఆదివారం ట్యాంక్బండ్ నెక్లెస్రోడ్డులో 'ఉమెన్స్ ఫన్ డే'ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, యువతులు,విధ్యార్థినులకు వారి సెక్యూరిటీకి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.అలాగే,ఆపద సమయంలో బాధితులు ఏ విధంగా స్పందించాలి,పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి మొదలైన అంశాలతో పాటు ఆత్మరక్షణ కు ఉపయోగించాల్సిన స్టంట్స్నూ లైవ్లో వివరించనున్నట్టు ఆమె తెలిపారు.