Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సదుపాయాలపై పీఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రయాణీకుల సౌకర్యాల కమిటీ (ప్యాసెంజర్ ఎమినీటీస్ కమిటీ-పీఏసీ) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను శనివారం సందర్శించింది. అక్కడి సదుపాయాలు, నిర్వహణను ప్రశంసించింది. ఈ కమిటీ ప్రయాణీకుల వసతులను తనిఖీ చేయడంతోపాటు ఆ రైల్వే స్టేషన్ వద్ద లభ్యమయ్యే ఇతర సదుపాయాలను కూడా తనిఖీ చేసింది. ఈ కమిటీలో చైర్మెన్ పీ.కె. కృష్ణదాస్, సభ్యులు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే, ఐఆర్ఎస్డీసీ అధికారులతో కమిటీ సమావేశమైంది. రైల్వే స్టేషన్లో సదుపాయాల నిర్వహణను ఐఆర్ఎస్డీసీ చూస్తుందంటూ వారు ఈ సందర్భంగా నివేదించారు. ఇతర స్టేషన్లలో కూడా ఐఆర్ఎస్డీసీ వసతులను నిర్వహిస్తున్న తీరును వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా పలు స్టేషన్లను ఐఆర్ఎస్డీసీ అభివృద్ధి పరుస్తుందని తెలిపారు. మరోవైపు ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ)కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సదుపాయాల నిర్వహణ బాధ్యతను అప్పగించామని వారు తెలిపారు. ఆ రైల్వే స్టేషన్లోని సదుపాయాలు, వాటి నిర్వహణను కమిటీ ప్రశంసించింది.