Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో
మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27 న రైతు సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇచ్చిన భారత్ బంద్కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ )రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ చేతివృత్తిదారులు, బీసీలు ఈ బంద్లో పాల్గొనాలని చేతివృత్తిదారుల సమన్వయకమిటీ కన్వీనర్ ఎంవీ రమణ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకర్ల సమావేశంలోబీసీహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి పాండురంగాచారి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆశయ్య, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, తదితరులు పాల్గొన్నారు. పీడీయస్యూ విజృంభణ రాష్ట్ర నాయకులు జాడి విలాస్ బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.