Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజల కోసం సోమవారం భారత్బంద్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఇది రాజకీయ బంద్ కాదనీ, ప్రజా సమస్యలపై జరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం విజయవంతం చేయాలని కోరారు. ఈమేరకు ఆదివారం రేవంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. 30న కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని కోరారు. ఇదిలా వుండగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఇదే అంశంపై పార్టీ క్యాడర్కు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి
సీఎం,కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అన్వేష్రెడ్డి లేఖ
వ్యవసాయం, అనుబంధ శాఖలు, రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ అన్వేష్రెడ్డి కోరారు. ఆదివారం ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన లేఖలు రాశారు. .