Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (మందుపాతర) పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీఆర్పీఎఫ్ 170 బెటాలియన్కు చెందిన జవాన్లు మెదక్ పాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని హల్బాపారా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాలకృష్ణ, సానిదదుల్ ఇస్లామ్ అనే ఇద్దరు జవాన్లు గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ పేలుడు అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమై గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.