Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది గురువారం పదవీ విరమణ చేశారు. 1985వ బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హౌదాలో ఉన్న త్రివేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ఏఎస్పీగా పోలీసు శాఖలో విధులను ప్రారంభించిన ఆయన పలు జిల్లాల ఎస్పీగా ,రేంజ్ డీఐజీగా , ఐజీగా పలు భాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర తొలి హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఐదేండ్ల పాటు ఆయన ఆ శాఖాధిపతిగా సేవలు అందించారు. ముఖ్యంగా గ్రేహౌండ్స్ ఐజీగా ఉమ్మడి ఏపీలో ఉన్న సమయంలో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి పావురాలగుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణానికి గురి కాగా ఘటనా స్థలాన్ని మొదటగా గుర్తించింది రాజీవ్ త్రివేదీయే. నిజాయితీ పరుడైన ఐపీఎస్ అధికారిగా పేరు పొందిన రాజీవ్ త్రివేది ఇంగ్లీష్ ఛానల్తో పాటు శ్రీలంక నుంచి కన్యాకుమారి వరకు సముద్రంలో ఈదీ తన ధైర్యసాహాసాలను చాటారు. ఆయనకు రాష్ట్రపతి పోలీసు మెడల్ కూడా లభించింది. తన జీవిత కాలంలో ఐపీఎస్ అధికారిగా చట్ట పరిధిలోనే విధులను నిర్వర్తించాననీ , శాంతి భద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో తన వంతు కృషి చేశానని ఆయన ఈ సంధర్భంగా వ్యాఖ్యానించారు.