Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాస ంవత్సరంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 20 వరకు గడువుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, కోఆపరేటివ్, గురుకులాలు, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందొచ్చని సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు చేపట్టాలని కోరారు.