Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారిని కలిసి ఇటీవల ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెవెన్యూ సమస్యలపై చేసిన తీర్మానాల నివేదిక అందజేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ పదోన్నతుల వంటి కీలకమైన అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామనీ, ప్రక్రియ కొనసాగుతుందని సీఎస్ తెలిపినట్టు ట్రెసా నాయకులు పేర్కొన్నారు.
2018 తర్వాత సర్వీస్లోకి వచ్చిన ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు కూడా 30 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ వర్తింప చేయడానికి సీఎస్ అంగీకరించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ సంఘం ప్రతినిధులు రాజయ్య, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.