Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశిష్ట సేవలందించిన వారికి కేటీఆర్ సన్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్తోపాటు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ను అసెంబ్లీలోని ఆయన చాంబర్లో ఘనంగా సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వృత్తి నైపుణ్యంతో రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు చెప్పారు. వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత పథకాల వల్ల ఆ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. చేనేత కళాకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తదితరులు పాల్గొన్నారు.