Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుత్తాపై అయోధ్యరెడ్డి విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి పార్టీ మారుతున్నట్టు లీకులు ఇచ్చి...ఆపై ఖండించుకున్నారంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయకర్త బోరెడ్డి అయోధ్యరెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్లో ఉనికి లేకుండా పోయిందనే ఆందోళనతోనే ఈ విధంగా ఆయన లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా గుత్తా జిల్లాలో పాల ఉత్పత్తి దారుల సంఘాన్ని, రైతులను నిలువునా ముంచడంతోపాటు మదర్ డైరీని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. గుత్తా బ్రదర్స్ అవినీతి, అక్రమాలకు రైతులు విసిగిపోయి ఇటీవల జరిగిన డైరీ ఎన్నికల్లో వారిని పక్కన పెట్టారన్నారు. రానున్న కాలంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారో, లేదోననే భయం గుత్తాకు పట్టుకుందని చెప్పారు.