Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారెక్కెందుకు సిద్ధం... దళితు బంధుచైర్మెన్ పదవి ఆయనకేనా?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభలో మంగళవారం దళిత బంధు పథకంపై స్వల్పకాలిక చర్చ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు లాబీల్లోకి రావడం చర్చనీయాంశమైంది.సీఎం చాంబర్లో కేసీఆర్తో మోత్కుపల్లి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆయన రెండు,మూడు రోజుల్లో కారెక్కుతున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చేరగానే నూతనంగా ప్రకటించిన దళిత బంధు పథకం రాష్ట్ర చైర్మెన్గా ఆయన్ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అందుకే ఆయన సీఎంను కలిశారనే చర్చ జరుగుతున్నది. ఇటీవల దళిత బంధుపై సీఎం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కావద్దంటూ బీజేపీ నిర్ణయించినా మోత్కుపల్లి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బీజేపీలో ఆయన పొసగడం లేదనే విమర్శలొచ్చాయి. బీజేపీలో చేరేకంటే ముందు టీఆర్ఎస్లో చేరాలనే ఆయన వైఖరిని ఆ పార్టీలో చాలా మంది నేతలు వ్యతిరేకించారు. దీంతో ఆయన అనివార్యంగా బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలోచేరిన తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నట్టు తన అనుయాయుల వద్ద వాపోయారు. ఇప్పటికే ఈమేరకు సీఎం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు తెలిసింది.