Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డిఎస్కు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలి
- తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్కు తుంగభద్ర జలాల మళ్లింపు, కెసి కెనాల్కు కృష్ణా జలాల వినియోగం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆర్డిఎస్ ఆనకట్ట ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేసి తెలంగాణ వాటాగా రావాల్సిన 15.9 టిఎంసిలు అందేలా చర్యలు తీసుకోవాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇఎన్సి మురళీధర్ మంగళవారం లేఖ రాశారు.
తుంగభద్ర డ్యాం నుంచి 2టిఎంసిలు కెసి కెనాల్కు కేటాయించాలన్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్ధన ఆమోదయోగ్యం కాదని, కృష్ణా వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ 1 అవార్డుకు వ్యతిరేకమని తెలిపారు. ఆర్డిఎస్కు కేటాయించిన నీటి వాటా ఏ ఏడాది పూర్తిగా అందలేదని, 6 టిఎంసిలకు మించి నీరు రావడంలేదని గుర్తుచేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు