Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 నుంచి జూనియర్ కాలేజీలకూ...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు బుధవారం నుంచి ఈనెల 17 వరకు పాఠశాల విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటిం చింది. ఈనెల 18న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. జులై ఒకటి నుంచి ఆన్లైన్ పాఠాలు, సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభ మైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈనెల 13 నుంచి 17 వరకు జూని యర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 18న కాలేజీలు పున:ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రిన్సిపాళ్లు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సెలవుల్లో కాలేజీల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని ఆదేశించారు.