Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దసరా నేపథ్యంలో హైకోర్టుకు గురువారం నుంచి ఈనెల 17వరకు సెలవులు ప్రకటించారు.ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు.తిరిగి 18నహైకోర్టులో విచారణలు ప్రారంభ మవుతాయని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. కాగా అత్యవసర పిటిషన్లు ఈనెల 8న దాఖలు చేసుకోవచ్చని సూచించారు. వీటిపై 11న ధర్మాసనం విచారణ చేపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.