Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్స్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ కే రఘురామ కష్ణంరాజు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను సాంకేతిక కారణాలతో హైకోర్టు వెనక్కి ఇచ్చింది. సాంకేతికంగా లేవనెత్తిన అభ్యంతరాలను నివత్తి చేస్తూ ఆయన రిట్లు వేయనున్నారు. బెయిల్స్ రద్దు చేయాలనే పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసిందని, అధికారంలో ఉంటూ సాక్షుల ప్రభావితానికి ఆస్కారం ఉందని, ఇతర నిందితులకు పదవులు ఇచ్చారని, బెయిల్స్ షరతులను ఉల్లంఘిస్తున్నారనీ, ఇలాంటి అనేక అంశాలను సీబీఐ కోర్టు పట్టించుకోలేదన్నారు.