Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- ఈఎన్టీ ఆస్పత్రి సందర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి బుధవారం సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. వారు అందిస్తున్న సేవలు బాగున్నాయంటూ ప్రశంసించారు. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి, బ్లాక్ ఫంగస్ ప్రబలిన సమయంలో ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రుల విలువ తెలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలను సకాలంలో మరమ్మతులు చేయటం, అవసరాల రీత్యా కొత్త పరికరాలను కొనుగోలు చేస్తే మరింత మెరుగ్గా సేవలందుతాయని అన్నారు. పాత భవనంలో నిర్వహిస్తున్న ఓపీకి రోగుల తాకిడీ ఎక్కువగా ఉందనీ, ఇప్పటికే మంజూరైన కొత్త భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాల్సిన అవసరముందని అన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో డాక్టర్ మనీష్ ఉన్నారు.