Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 'బతుకమ్మ పేర్చండి బంగారం గెలుచుకోండి' పేరుతో వలయం టీవీ నిర్వహిస్తున్న బతుకమ్మ పోటీల్లో తొలిరోజు గెలుపొందిన విజేతలకు యాజమాన్యం పట్టుచీరలను అందించి శుభాకాంక్షలు తెలియజేసింది. హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన సంధ్య యముసాని, హిమాయత్ నగర్కు చెందిన పద్మజా రెడ్డి, కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన జయశ్రీ దేవునూరిలు విజేతలుగా నిలిచారు. ఈ పోటీలో పాల్గొనేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు యూట్యూబ్లో వలయం టీవీని సందర్శించాలని యాజమాన్యం ప్రకటించింది. విజేతలకు పట్టు చీరలతో పాటు బంగారం, వెండిని సైతం బహుమతులుగా అందిస్తున్నామని తెలిపారు.