Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభ ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం భూపాల్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు తదితరులు బతుకమ్మ ఆటలాడి అలరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులుతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా గురువారం రెండో రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలను శాసనసభ సచివాలయ ఉద్యోగులు నిర్వహించారు.