Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 201 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 47,465 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 41,970 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,495 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,726 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,345 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఐదు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.