Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అసెంబ్లీలో 101 మంది సభ్యులు ఉన్న అధికారపార్టీ సభ్యులకంటే ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చామని శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, చీఫ్విప్ వినరుభాస్కర్, విప్ గంప గోవర్థన్ తెలిపారు. శాసనసభ నిరవధిక వాయిదా పడిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. శాసనసభ నిర్వహణలో సభ్యులంతా సహకరించారని చెప్పారు. ఆరు అంశాలపై విస్త్రుత చర్చ జరిగిందన్నారు. సభాసమయం ఎక్కడా వృధా కాలేదనీ, వాకౌట్లు, సస్పెన్షన్లు లేవని తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు సభలో 9.02 గంటలు, ప్రతిపక్ష సభ్యులు 11.08 గంటల పాటు మాట్లాడారని వివరించారు. సమయం ఇవ్వలేదని కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క చెప్పడం సరికాదన్నారు. మరికొన్నాళ్లు సభను నడపాలని ముఖ్యమంత్రి భావించారనీ, పండుగలు ఉన్నాయని సభ్యులు కోరడంతో ముగించాల్సి వచ్చిందన్నారు.