Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లికి ఈ-పంచాయతీ ఆపరేటర్ల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ - పంచాయతీ ఆపరేటర్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో శనివారం కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలని కోరారు. పీఆర్సీ ప్రకారం కనీస వేతనాన్ని పెంచాలనీ, తమని పంచాయతీ కార్యదర్శులకు సహాయకులుగా పరిగణించాలనీ, హెల్త్ కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బంగారు తెలంగాణలో భాగమై పని చేస్తున్న తమకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని మంత్రిని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.