Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 11 నుంచి 30 వరకు స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశాన్ని కల్పిం చింది. ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు వాటిని స్వీకరించనున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు సర్క్యూలర్ను ఆదివారం జారీ చేసింది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్కు ఆదేశాలు జారీచేసి చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 57 ఏండ్లు, ఆపై వయస్సు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్లను పొందేందుకు అర్హత వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించిన విషయం విదితమే. ఆగస్టు 31 నాటికి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సేవ, మీ సేవల సర్వర్లు స్లోగా ఉండటం, జనన ధ్రువీకరణ, ఇతర అర్హత పత్రాలు పొందే క్రమంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. అర్హులు, ఆయా రాజకీయ పార్టీల సూచనలు, ఒత్తిడి తో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిం చింది. ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవా కేంద్రాల్లో సేవా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నది.