Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షపై టి-సాట్ స్పెషల్ లైవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రెండు విడతలుగా నిర్వహించే సి-టెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షపై టి-సాట్ నెట్ వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు టి-సాట్ నిపుణ ఛానల్ లో స్పెషల్ లైవ్ ప్రసారం కానుంది. సి-టెట్ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంపై టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు సి-టెట్ పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డి.ఎడ్., బి.ఎడ్., పూర్తి చేసిన సుమారు 4లక్షల మంది అభ్యర్థులు సి-టెట్ ఉత్తీర్ణత సాధిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్మీ, నవోదయ, సైనిక్ పాఠశాలల వంటి తదితర ఆరు పాఠశాలల్లో ఉద్యో గాలు పొందేందుకు అర్హత కలుగుతుందన్నారు. సి-టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలో నిర్వ హించే డి.ఎడ్., బి.ఎడ్ అర్హత పరీక్షల్లోనూ వెయి టేజీ దక్కుతుందని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టి-సాట్ అవగాహన ప్రసారా లను వినిగించుకోవాలని సూచించారు. సి-టెట్ పరీక్షలు డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5, 2022 వరకు వివిధ స్థాయి ల్లో నిర్వహించేందుకు తేదీలు నిర్ణయించగా, ఈ నెల 18వ తేదీ ధరఖాస్తుకు చివరి తేదీ అని చెప్పారు. అర్హత పరీక్షపై నిర్వహించే అవగాహన కార్యక్రమం లో వరంగల్ డైట్ రిటైర్డ్ లెక్చరర్ చెన్నాడి కేశవరావు కార్యక్రమంలో పాల్గొం టుండగా సి-టెట్ ఇంగ్లీష్ విభాగం టాపర్ కె.హరిప్రియ, తెలుగు విభాగం టాపర్ మానస చర్చలో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు.