Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్ కమ్యూనిస్టులదే..
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-చింతకాని
అఖిల భారత స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) చింతకాని మండల 8వ మహాసభను గడ్డం ఆదినారాయణనగర్లో సోమవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మీడియాతో తమ్మినేని మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు పరుస్తున్న బీజేపీతో పెనుప్రమాదం పొంచి ఉందన్నారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు చేస్తూ మత సామరస్యానికి తీవ్ర ఆటంకం కలుగిస్తుందన్నారు. స్వాతంత్రోద్యమ పోరాటాన్ని, సాయుధ తెలంగాణ పోరాటాలను వక్రీకరిస్తుంద న్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేయబోతున్నామని చెప్పారు. భవిష్యత్ ఉద్యమాల్లో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తామని, భవిష్యత్తు కమ్యూనిస్టుల దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.