Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణా ఏవియేషన్ అకాడమీకి ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు రావడంపట్ల అకాడమీ సీఈఓ కాప్టెన్ ఎస్ఎన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణా ఏవియేషన్ అకాడమీకి ఐదుసార్లు ఈ అవార్డు దక్కడం గొప్పవిషయమని సీఎస్ అన్నారు. దేశంలోని 21 ఫ్లయింగ్ అకాడమీలలో పైలెట్ల శిక్షణ, డ్రోన్ పైలెట్ ట్రైనింగ్, ఏవియేషన్ ఇంజినీరింగ్ శిక్షణ లో మెరుగైన ఫలితాలను సాధించినందుకు తెలంగాణా ఏవియేషన్ అకాడమీ కి ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. ఈ అవార్డు లభించిన సందర్బంగా అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అకాడమీ లో ప్రస్తుతం 70 మంది పైలెట్ శిక్షణ పొందుతున్నారనీ, మరో 230 మంది విద్యార్థులు ఎయిర్ క్రాఫ్ట్ ఇంఇనీరింగ్ లోనూ, 60మంది డ్రోన్ పైలెట్లుగా శిక్షణ పొందుతున్నారని వివరించారు. దేశంలోని మొత్తం ఏవియేషన్ శిక్షణా సంస్థల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్నందుకు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఐదు సార్లు ఈ ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ అఫ్ ఇండియా ట్రోఫీ ని పొందామని వివరించారు.