Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, సబ్కమిటీ కన్వీనర్ చెరుపల్లి
- కరోనాతో మృతిచెందిన ఉద్యోగి కుటుంబానికి చేయూత
నవతెలంగాణ- సిటీబ్యూరో
నవతెలంగాణ పత్రికకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా.. ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పత్రిక సబ్కమిటీ కన్వీనర్ చెరుపల్లి సీతారాములు అన్నారు. హైదరాబాద్ చర్లపల్లిలోని లక్ష్మీదాస్భవన్లో దసరా సందర్భంగా సీనియర్ ఆపరేటర్ నర్సింగ్రావు అధ్యక్షతన నవతెలంగాణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని సన్మానించారు. గతంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి దయానంద్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును చెరుపల్లి సీతారాములు, ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులంగా మరింత పట్టుదలతో పనిచేయాలన్నారు. సుధాభాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు ప్రజలను చీల్చుతున్నాయన్నారు. కార్మిక, కర్షకులపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవతెలంగాణ సంస్థకు ఉద్యోగులే యజమానులని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పత్రికను మరింత నాణ్యతగా తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం ఉద్యోగులు ఆటా పాటలతో గడిపారు. నాటిక కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ జనరల్ మేనేజర్ కె.రఘు, మార్కెటింగ్ మేనేజర్ బి.ఉపేందర్రెడ్డి, ప్రొడక్షన్ ఇన్చార్జి బి.పురుషొత్తం, చెర్లపల్లి ప్రెస్ ఇన్చార్జి బి.శ్రీనివాస్రెడ్డి, సీనియర్ ఆపరేటర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.