Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు గవర్నర్, సీఎం దసరా శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు గురువారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. తెలంగాణకు ఈ పండుగ ఒక ప్రత్యేకమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించ కూడదనే స్ఫూర్తితో, చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.
రేవంత్, కిషన్రెడ్డి శుభాకాంక్షలు...
దసరా సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.