Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో కన్నుమూత
- నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర
నవతెలంగాణ-చర్ల
సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో గురువారం మరణించినట్టు సమా చారం. చత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ అడవీ ప్రాంతం లో అనారోగ్యంతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. చత్తీస్గఢ్ పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. దక్షిణ బస్తర్ జిల్లా దండకారణ్యంలో ఆర్కే మృతి చెందినట్టు, ఇప్పటికే అతని అంత్యక్రియలు పూర్తియినట్టు తెలుస్తోంది. అయితే, గురువారం రాత్రి 9 గంటల వరకు ఆర్కే మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కానీ, ఏవోబీ కమిటీ సైతం స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. కాగా, మావోయిస్టుల అది నాయకత్వంలో అగ్రగణ్యుడయిన ఆర్కే గెరిల్లా ఆర్మీ నిర్మాణంలో, శత్రువులపై దాడి చేయడంలో మాస్టర్ మైండ్గా పేరు ఉంది. దాంతో ఆర్కేపై అనేక కేసులు న్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు. 2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆర్కే మావోయిస్టుల పక్షాన నాయకత్వం వహించి పాల్గొన్నారు. ఆర్కే ఏవోబీ మావోయిస్టు కార్యదర్శిగా ఉన్న సమయంలో ఒరిస్సాలోని మల్కంగిరి, బలిమెల దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్కే కుమారుడు మరణించాడు. ఆయనకు బుల్లెట్ తగిలి గాయమైంది. దాంతో ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించినట్టు తెలుస్తోంది. వరంగల్ నిట్లో బీటెక్ పూర్తిచేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన భార్య పద్మజ కూడా ఆర్కేతో పాటు ఉద్యమంలో పనిచేశారు. వారి కొడుకు ఆర్కే అంగరక్షకుడిగా ఉండేవాడు. కాగా, ఆయన భార్య బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయింది..