Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొరాయిస్తున్న టికెట్ మిషన్లు
- డొక్కు టిమ్స్తో కండక్టర్ల ఇక్కట్లు
- చెకింగ్ వాళ్లతో భయంభయం
- మధ్యలోనే ప్రయాణికులను దింపేస్తున్న వైనం
ఇ.రత్నాకర్
కండక్టర్ : ఆ టికెట్.. టికెట్..
ప్రయాణికుడు : హకీంపేట్ సార్
కండక్టర్ : ఒకటేనా?
ప్రయాణికుడు : ఒకటే సార్
కండక్టర్ : ఛీ..ఇదేం మిషిన్రయ్య. .టిక్కెట్లొచ్చి చస్తలేవు..స్టాప్ రాబట్టే.. (నిట్టూర్పు..) దిగండి.. దిగండి.. టికెట్లు వస్తలేవు..
ప్రయాణికుల గగ్గోలు.. ఏంటండి.. ఈ మధ్యలో దింపడాలు? గీడ దింపితే ఎక్కడ పోవాలే?
కండక్టర్ : టికెట్ రానిది నీనేం జేయాలే? వేరే బస్సు ఎక్కిస్త ఆగండి.. లేకుంటే వేరే మిషన్ వచ్చేదాక ఆగండి.. ఇంతలోనే వేరే బస్సు వచ్చింది. ప్రయాణికులు ఆ బస్సులో ఎక్కి వెళ్లిపోయారు.
ఇదీ సికింద్రాబాద్-హకీంపేట బస్సులో చోటు చేసుకున్న ఘటన. ఇది ఒక్కటేగాదు. హైదరాబాద్ నగరం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉత్పన్నం అవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోని మిషన్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సంస్థలో 2009లో టీఐఎంఎస్ (టికెట్ జారీ మిషన్ సర్వీసెస్)ను అందు బాటులోకి తీసుకొచ్చారు. క్వాంటాం, ఎలనాజిస్ అందు బాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మైక్రో కంపెనీలకు చెందిన టీఐఎంఎస్ మిషన్లను సైతం వినియోగిస్తున్నారు. కంపెనీ ఏడాది పాటు గ్యారెంటీ ఇస్తోంది. మరో 3 ఏండ్లపాటు మెయింటనెన్స్ చేస్తోంది. ఆ తర్వాత కొత్త మిషన్లు కొనుగోలు చేయాలి, లేదా ఉన్న మిషన్లను రిపేర్ చేసుకుని వినియోగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9000 మిషన్లను ఉపయోగిస్తున్నట్టు తెలు స్తోంది. గతంలో డ్రైవర్లకు ఆ మిషన్లు ఇచ్చే వారు. 2017లో టికెట్లను మొత్తానికే ముద్రిం చడం నిలిపేశారు. దాంతో ప్రతి కండక్టర్కూ టీఐఎంఎస్ మిషన్లను అందించారు.
ప్రయాణీకులకు తప్పని ఇబ్బందులు
టీఐఎంఎస్ (టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సర్వీ సెస్)తో ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్ స్టాటింగ్ పాయింట్ (బస్టాండ్) నుంచి టికెట్లు జారీ చేస్తారు. రెండు మూడు స్టేజీల తర్వాత మార్గమధ్యలో మిషన్ మొరాయిస్తే ఇబ్బందులే. అప్పటి వరకు టికెట్లు ఇచ్చిన ప్రయాణికులను మినహాయిస్తే కొత్త వారిని ఎక్కించుకోని పరిస్థితి. బలవంతంగా ప్రయా ణీకులు బస్సు ఎక్కితే కండక్టర్ దింపేయాల్సిం దే. తీసుకెళ్తామనుకున్నా టీసీలు చెక్ చేస్తే కండక్టర్లకు ఇబ్బందులుతప్పవు. దాంతో ప్రయాణీకు లకు, కండక్టర్లకు వాగ్వాదం చోటుచేసుకుంటోంది.
ప్యాట్నీ సెంటర్..
కొద్ది రోజుల కిందట సికింద్రాబాద్ నుంచి హకీంపేట్కు వెళ్లేందుకు 211యు బస్సులో ప్రయాణీకులు ఎక్కారు. ప్యాట్నీవద్దకు చేరుకునేలోపే టికెట్ మిషన్ మొరాయిం చింది. దాంతో గంటన్నర సేపు బస్సు నిలపాల్సి వచ్చింది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు కోసం వేచి చూస్తున్న మరికొందరు ప్రయాణీకులను బస్సు ఎక్కనివ్వక పోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి సమస్యలు గ్రేటర్ హైదరాబాద్లో మామూలుగానే మారాయని పలువు రు ఆరోపిస్తున్నారు. సమస్యపై అధికారుల దృష్టికి తీసుకె ళ్లగా, కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మిషన్లు మొరాయిస్తు న్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిని ఆయా డిపోల్లో రిపేర్ చేస్తుంటారన్నారు. ఏదైనా టెక్నికల్ ఇబ్బందులుంటే త్వరలో నే పరిష్కరిస్తామని తెలిపారు.
పాస్హోల్డర్లకు లగేజీ లేకపాయే
హైదరాబాద్ జంటనగరాల నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ జిల్లాలకు 3,381 బస్సులను నడిపిస్తోంది. గ్రేటర్లోనే 9లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రతిరోజు 34లక్షల మందికిపైగా ప్రయాణి కులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. శివారు ప్రాంతా ల్లో నివాసముండే వేలాది మంది వివిధ పనుల నిమిత్తం జంటనగరాలకు వస్తూ పోతుంటారు. పూలూ, కూరగాయల వ్యాపా రులతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు తదితర వ్యాపారులు నిత్యం ఆర్టీసీ బస్సు సేవలను వినియోగిస్తు న్నారు. ఈ క్రమంలో కొందరు నెలవారి బస్ పాస్లను విని యోగిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు వారి వెంట కిలోలకొద్ది లగేజీలను తీసుకెళ్తుంటారు. అయితే 50కిలోల బరువు లగేజీ వరకు ఆర్టీసీ ఉచితంగానే అనుమతిస్తోంది. 50కేజీల పైబడిన వాటికి మాత్రం దూరాన్ని బట్టి టికెట్ తీసుకోవాలి. ఇక్కడా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. టికెట్పై ప్రయాణిం చే వారికి టికెట్తోపాటు లగేజీ టికెట్ ఇస్తున్నారు. అయితే సీజనల్ పాస్లు, స్టూడెంట్, రిటైర్డ్ ఉద్యోగులు, (జర్నలిస్ట్ స్టేట్పాస్లను మినహాయించి) జిల్లా జర్నలిస్ట్ పాస్లతో పాటు ఫ్రీడంఫైటర్ల పాసులున్న వారికి 50 కిలోల పైబడిన లగేజీకి టికెట్ ఇచ్చే ఆప్షన్ టికెట్ల మిషన్లో లేదు. దాంతో డబ్బులు చెల్లిస్తామన్నా కండక్టర్లు టికెట్ ఇవ్వలేకపోతున్నా రని సమాచారం.
ప్రత్యేకించి టీఐఎంఎస్ మిషన్లో బస్ పాస్ ప్రయాణికులకు ప్రత్యేకంగా లగేజీఆప్షన్ లేకపోవడం తోనే ఇబ్బందులకు దారితీస్తోందనితెలుస్తోంది. తోటి ప్రయా ణికులను రెక్వెస్ట్ చేసి లగేజీకి టికెట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్తవాటిని తెప్పించాల్సిన అవసరముంది
- ఎస్డబ్ల్యూఎఫ్ హైదరాబాద్ రిజినల్ కార్యదర్శి కృష్ణ
టీఐఎంఎస్ (టికెట్ ఇష్యుయింగ్ మిషన్ సర్వీసెస్)లో కొన్ని అక్కడక్కడ మొరాయిస్తున్న విషయం వాస్తవమే. మరికొన్ని మిషన్లు చెడిపోతున్నాయి. దాంతో ప్రయాణీకు లకు, కండక్టర్లకు, డ్రైవర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త టీమ్ మిషన్లు తెప్పించాల్సిన అవసరముంది.
ఆర్టీసీకి ఆదాయం తగ్గే అవకాశముంది
- ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్
కొన్ని ప్రాంతాల్లో టీఐఎంఎస్ మిషన్లు చెడిపోవడంతో స్టాఫ్కు, ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. మిషన్లు చెడిపోయిన సమయంలో దగ్గర్లోని డిపోలకు వెళ్లి వాటిని రిపేర్ చేయించుకోవాలి లేదా కొత్త వాటిని తీసుకోవాల్సి వస్తోంది. అప్పటి వరకు కొత్త ప్రయాణీకులను ఎక్కించు కోలేం. బస్సుల్లో టీమ్స్ మిషన్లు మొరాయిస్తుండటంతో ఆర్టీ సీకీ ఆదాయం తగ్గే అవకాశముంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త మిషన్లు తెప్పించాలి. దాంతో ఆర్టీసీకి ప్రయాణీకులు పెరగడంతోపాటు ఆదాయం వస్తుంది.
డొక్కు మిషన్లు
ఆర్టీసీలో వినియోగిస్తున్న టీఐఎంఎస్ మిషన్లు చాలోచోట్ల పనిచేయడం లేదు. డొక్కుమిషన్లతో కండక్టర్లు, డ్రైవర్లు, ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. టిఐఎంస్ మిషన్లు నాసిరకంగా ఉన్నాయి. టీమ్ మిషన్లతోపాటు అత్యవసరంగా ఉపయోగించేందుకు మ్యాన్వల్గా టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తే బాగుండేది.
- తెలంగాణ పేద ప్రజల సంక్షేమం అధ్యక్షులు ఏ.సత్తిరెడ్డి.