Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాలాలో పడి చనిపోయి న రాజు భార్యకు కాంగ్రెస్ పార్టీ ఉచిత వైద్యాన్ని అందించింది. కొద్ది రోజుల క్రితం ఎల్.బి నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో నాలలో పడి జిహెచ్ఎంసి కాంట్రాక్టు కార్మికుడు రాజు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజు భార్య గర్భిణీ కావడంతో ఆమెకు ఉచిత వైద్యం అందించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణను కోరారు. ఆయన ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు చెందిన అంకిత్ ఆస్పత్రిలో ఆమెను చేర్చుకుని చికిత్సనందించారు. శనివారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.