Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన తమ ఇద్దరు విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ 2021 పరీక్షా ఫలితాలలో టాప్ 500లో పలు ర్యాంకులను సాధించారని ఆకాష్ ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. టాప్ 500లో ర్యాంకులను సాధించిన విద్యార్ధులలో గౌతమ్సింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ 191 సాధించగా, శ్రీ నికేతన్ జోషి 491వ ర్యాంక్ పొందారని పేర్కొంది. ఈ ఇరువురు విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఆకాష్ ఇనిస్టిట్యూట్లో రెండు సంవత్సరాల క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరారని తెలిపింది.