Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్క్స్ కమిటీ ఎన్నికల్లో ఏఐడిఈఎఫ్ విజయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిలిటరి ఇంజినీరింగ్ సర్వీసెస్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ ( జీఈ నార్త్- సికింద్రాబాద్)కు చెందిన వర్క్స్ కమిటీ ఎన్నికల్లో అఖిల భారత రక్షణ ఉద్యోగుల ఫెడరేషన్( ఏఐడీఈఎఫ్) గెలుపొందింది. వర్క్స్ కమిటీలోని ఐదు స్థానాలకు గాను నాలుగింటిలో ఏఈడీఈఎఫ్ నాయకులు, వర్క్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.చలమయ్య ప్యానెల్కు చెందిన నలుగురు ఇటీవల ఏకగ్రీవంగా విజయం సాధించారు.ఎన్నికైన వారిలో ఉపాధ్యక్షులుగా ఎస్.ముకుందన్, ఎంటీఎస్గా ఎం శ్రీనివాస్, మేట్లుగా ఎస్. బాబూరావు, అలైస్, బిఏ గురువయ్య ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నలుగురిని ప్రధానకార్యదర్శి చలమయ్య సన్మానించారు. అలాగే ఏఈడీఈఎఫ్ అఖిల భారత సహాయ కార్యదర్శి గోపాలరావు సైతం అభినందించారు.