Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 111 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 30,050 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులె టిన్ వెల్లడించింది.ప్రభుత్వాస్పత్రుల్లో 26,592 మంది కి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,458 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 954 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,979 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 29 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో 11 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
14 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శుక్రవారంతో పోలిస్తే శనివారం14జిల్లాల్లో కేసులు పెరిగాయి.భద్రాద్రి కొత్తగూడెం,జోగులాంబ గద్వాల, కామారెడ్డి,కరీంనగర్, ఖమ్మం,మంచిర్యాల,మెదక్,మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.