Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ
- కేజేఎస్ ఆధ్వర్యంలో ఐఆర్ఎస్ ట్రైనీలకు అవగాహన
నవ తెలంగాణ - పటాన్చెరు
ఐఆర్ఎస్ ట్రైనీలకు భవిష్యత్తు సర్వీసెస్లో ఈ ట్రెనింగ్ ఎంతో ఉపయోగపడుతుందని ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గాయత్రి అన్నారు. ఐఆర్ఎస్ 74వ బ్యాచ్కు చెందిన 60 మంది ట్రైనీల ఇండిస్టియల్ టూర్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని కేజేఎస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్కు విచ్చేశారు. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి.. ట్రైనీస్కు కేజేఎస్ ఇండియా పరిశ్రమలోని ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పరిశ్రమలు నడిచే విధానం, అందులో ఉత్పత్తి అయ్యే సరుకులు, గిడ్డంగులు విభాగాలు, ఆర్థిక విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ అంశాలపై వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ట్రైనింగ్లో పాల్గొన్న బ్యాచ్కు భవిష్యత్ సర్వీసెస్లో ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ టూర్లో భాగంగా ఫార్మా, టెక్స్ట్టైల్స్ పరిశ్రమలనూ సందర్శించన్నన్నట్టు తెలిపారు. అనంతరం కేజేఎస్ పరిశ్రమ యజమాని గిరీష్ జైన్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి తయారీ సంస్థల్లో కేజేఎస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఒకటిగా ఉందన్నారు. భవిష్యత్తులో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రోగ్రామ్స్ కూడా తమ సంస్థ ద్వారా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో.. కేజేఎస్ ఇండియా డైరెక్టర్లు సి.పి రన్కా, నరేందర్ రెడ్డి, సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.