Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న ఆలోచనను మానుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భూపాలపల్లిలోని బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే వినియోగించాలని కోరారు. దాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటూ కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది రాష్ట్ర సింగరేణి అధికారులను మౌఖికంగా ఆదేశించారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కొరత ఉందనే కారణంతో ఇక్కడి బొగ్గును తరలించి భూపాలపల్లి విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలిగిస్తే ఎలా? అని ప్రశ్నించారు.