Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో వారితో హెకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేయించారు. సీనియర్ జిల్లా జడ్జిలు పి. శ్రీ సుధ, సి. సుమలత, జి. రాధా రాణి, ఏం. లక్ష్మణ్, నూన్సావత్ తుకారంజీ, ఏ. వెంకటేశ్వర్రెడ్డి, ఆదాయపన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలు పి. మాధవీ దేవి హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు.