Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 122 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారంసాయం త్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 26,676 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 22,593 మంది కి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,083 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 549 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,924 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీ లో అత్యధికంగా 55 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా తొమ్మిది జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో 10జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.