Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నాగార్జునను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న అనుపమ చక్రవర్తిని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా బదిలీ అయ్యారు. ఐటీ రిజిస్ట్రార్ (ఓఎస్డీ) చేస్తున్న ఎం రాధాకృష్ణ ఎల్బీనగర్ కోర్టు మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. హెకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ) ఓఎస్డీగా మహబూబ్నగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జిగా చేస్తున్న రమాకాంత్ నియమితులయ్యారు.