Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 202 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,808 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 40,421 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 6,387 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,769 మంది రిపోర్టులురావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తు తం 3,940 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 52 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా 11 జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డా రు. మరో రెండు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
12 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం 12 జిల్లాల్లో కేసులు పెరి గాయి. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీం నగర్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామా బాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
11 జిల్లాల్లో తగ్గిన కేసులు
జీహెచ్ఎంసీతో సహా భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
ఆ జిల్లాల్లో జీరో....
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా, జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. నాగర్ కర్నూల్లో మూడు రోజులుగా, ఆదిలాబాద్, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో రెండు రోజులుగా మార్పు లేదు.