Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించింది. దసరా సందర్భంగా ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు రూ.111.91 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈనెల 18వ తేదీ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.14.79 కోట్ల ఆదాయం వచ్చింది. దసరా పండుగకు ముందు సంస్థ ఆదాయం సగటున రూ.9.71 కోట్లు కాగా, దసరా పది రోజుల్లో సగటు ఆదాయం రూ.10.71 కోట్లకు పెరిగింది.
సహజంగా ఏటా దసరా సీజన్లో మామూలు చార్జీకి అదనంగా మరో 50 శాతం వసూలు చేస్తారు. ఈ ఏడాది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ 50 శాతం అదనపు చార్జీలను రద్దు చేశారు. దీనితో ఆర్టీసీ బస్సుల్లో ఆక్కుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగింది. దసరా సీజన్లో సగటున 63.19 శాతం ఓఆర్ నమోదైంది.
ఈ సీజన్లో ఆర్టీసీ బస్సులు 63.19 లక్షల కిలోమీటర్లు తిరిగి, 2.80 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చినట్టు వీసీ సజ్జనార్ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణీకులు, సంస్థ పురోభివృద్ధికి కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్లు, మెకానిక్లకు ఆయన అభినందనలు తెలిపారు.