Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు, ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జనకు సన్నాహాలు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు దిశానిర్దేశం చేశారు. గురువారంనాడాయన తెలంగాణ భవన్లో మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మంత్రులు పువ్వాడ అజరు కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, చేవెళ్ల లోక్సభ సభ్యులు రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణిదేవి, కుర్మయ్యగారి నవీన్ కుమార్, యోగానంద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనిత దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.