Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 183 మందికి కరోనా సోకగా, ఆ వ్యాధి నుంచి 183 మంది కోలుకున్నారు. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,363 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 36,385 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,978 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,644 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,967 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 59 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా 12 జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఐదు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
ఎనిమిది జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో బుధవారంతో పోలిస్తే గురువారం జీహెచ్ఎంసీతో సహా 14 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
15 జిల్లాల్లో తగ్గిన కేసులు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
ఆ జిల్లాల్లో జీరో...
ములుగు, నారాయణపేట జిల్లాల్లో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. జనగామ, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో మూడు రోజులుగా రోజుకు ఒకరు చొప్పున వ్యాధి బారిన పడ్డారు. జోగులాంబ గద్వాల, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో రెండు రోజులుగా కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.