Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీజేఎంఏకు ఇంటర్ బోర్డు కార్యదర్శి హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీల సమస్యలను పరిష్కరిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ హామీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరి సతీష్ నేతృత్వంలో జలీల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలిపిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సహకరిస్తామని ప్రకటించారు. హాల్టికెట్లపై సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లు సంతకాలు చేయడానికి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు పార్థసారధి, సుధీర్రెడ్డి, సుధాకర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.