Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది.ఈ మేరకు తపస్ అధ్యక్షులు హన్మంతరావు,ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25న పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి నిరసన తెలుపుతామని వివరించారు.అదేరోజు తహశీల్దార్లకు,ఈనెల 26,27 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో కలెకర్లకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు.