Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం జరిగిన పీఈసెట్ రాతపరీక్ష శనివారం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిసింది.ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఫిజికల్ టెస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 14కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 5,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారనీ,వారిలో 3,133 మంది అభ్యర్థు లు ఫిజికల్ టెస్టుల కోసం హాజరయ్యారని వివరించారు.1,921 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వీసీ సిహెచ్ గోపాల్రెడ్డి ప్రారంభించారని తెలిపారు.