Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 135 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో శనివారం సాయంత్రానికి 42,108 మందికి టెస్టులు చేస్తే అది కాస్తా ఆదివారం సాయంత్రానికి 26,842 మాత్రమే చేశారు. అదే తరహాలో నమోదైన కేసుల సంఖ్య కూడా 207 నుంచి 135కు తగ్గింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా మీడియా బులెటిన్ను విడుదల చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం 22,842 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,655 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 870 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,950 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో 12 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
23 జిల్లాల్లో తగ్గిన కేసులు
ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
నాలుగు జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శనివారంతో పోలిస్తే ఆదివారం జీహెచ్ఎంసీతో సహా నాలుగు జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, జిల్లాల్లో కేసులు పెరిగాయి.
ఆ జిల్లాల్లో జీరో...
నారాయణపేట జిల్లాలో ఐదు రోజులుగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజులుగా, కామారెడ్డి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు.