Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వచ్చే యాసంగి సీజన్లో వరి మినహాయించి, ఇతర పంటలు వేసుకొనేలా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. ఆదివారంనాడాయన 36 వివిధ విత్తన ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) వరి ధాన్యం కొనేది లేదని తేల్చిచెప్పిన నేపథ్యంలో రైతులు ఇతర పంటలకు వెళ్లే అవకాశం ఉన్నందున, వాటి విత్తన ఉత్పత్తులను పెంచాలని చెప్పారు. వరి స్థానంలో వేరుశెనగ, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సజ్జలు, నువ్వులు, మినుములు వంటి పంటల విత్తనాలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు.