Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు
నవతెలంగాణ - ఉండవల్లి
తహసీల్దార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగిన రికార్డులు కాలిపోయాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయం రికార్డు గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రికార్డులన్నీ కాలిపోయాయి. ఎవరైనా అంటించారా.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.